తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పొలం నుండి తొలగించాలి.
అంతర పంటగా కంది వేయాలి
మిగతా వివరాలకు మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించగలరు.
కాయకుళ్ళు బూజు తెగులు
ఈ తెగులు ముఖ్యంగా గెలపైన లేదా కొన్ని కాయలపైన గోధుమ రంగు ,మచ్చలు ఏర్పడి ,తర్వాత ఈ వ్యాధి అన్ని కాయలకు వ్యాపిస్తుంది.తెగులు సోకిన భాగాల పైన దూది పింజలాంటి బూడిద లేక గోధుమ వర్ణపు శిలీంద్రపు పెరుగుదల కనిపిస్తుంది.తెగులు సోకిన కాయలు మెత్తబడి,కుళ్ళి రాలిపోతాయి.గెల కాడ పై,శాఖలపై కూడా ఈ తెగులు ఆశించడం వలన వ్యాధి సోకిన భాగాలు విరిగి పడిపోతాయి.
నివారణ
పొలంతో మొక్కలను మరీ దగ్గరగా నాటరాదు.
సకాలంలో పంటను విత్తుకోవాలి.
తెగులు సోకిన కాయలను,గెలలనుకోసి పొలానికి దూరంగా వేసి తగల బెట్టి దీని వ్యాప్తిని అరికాట్టాలి.